
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● వడిచర్ల సమీపంలో ఘటన
లింగాలఘణపురం: మండలంలోని జనగామ– సూర్యాపేట రోడ్డులో వడిచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన ముదుగులోజు వినయ్ (27) దుర్మరణం చెందాడు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వినయ్ పని నిమిత్తం ద్విచక్రవాహనంపై జనగామ వెళ్తున్నాడు. వడిచర్ల సమీపంలోని పీవీఆర్ పాఠశాల మలుపు వద్ద జనగామ నుంచి సూర్యాపేట వైపునకు వెళ్తున్న డీసీఎం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. కాగా, వినయ్ మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
నర్సింగాపురంలో బైక్పై నుంచి పడి
మరో యువకుడు..
కొడకండ్ల : బైక్ అదుపు తప్పడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని నర్సింగాపురం శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. స్టేషన్ఘన్పూర్ మండలం కోమటిగూడెం గ్రామానికి చెందిన గూడెల్లి కుమార్(38) బైక్పై కొడకండ్ల మండలానికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో కొడకండ్ల–పాలకుర్తి రహదారిపై నర్సింగాపురం శివారులో బైక్ అదుపు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య అశ్విని, ఇద్దరు కుమార్తెలున్నారు. ఎస్సై చింత రాజు ఘటనా స్థలిని పరిశీలించి ప్రమాద వివరాలు సేకరించారు.
వేములవాడలో
ములుగు జిల్లా వాసి మృతి
ములుగు రూరల్: వేములవాడలో ములుగు జిల్లా వాసి మృతి చెందాడు. మ ల్లంపల్లి మండలం భూపాల్నగర్కు చెందిన సాద రాజు (32) ఈ నెల 5వ తేదీన బంధువులతో కలిసి వేములవాడ వెళ్లాడు. మూడు రోజులు అక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయం బంధువులు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో బంధువులు లక్ష్మీనరసింహ స్వామి గుడి ఆవరణలో వెతుకుతుండగా పక్కన ఉన్న కోనేరు వద్ద రాజుకు సంబంధించిన వస్తువులు కనిపించాయి. దీంతో కోనేరులో పడి ఉంటాడని భావించి స్థానికులతో కలిసి వెతకగా మృతదేహం లభించింది. వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని రాజు తండ్రి సమ్మయ్యకు అప్పగించినట్లు తెలిసింది. కాగా, రాజు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం