
‘ఇందిరమ్మ’ ఇళ్ల శ్లాబ్లు పడేదెప్పుడు?
ఉమ్మడి వరంగల్లో లబ్ధిదారుల ఎంపిక, ప్రొసీడింగ్స్జారీలో ఆలస్యం
ఇటీవల ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సందర్భంగా
విడుదల చేసిన లెక్కలు ఇలా...
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జాబితాపై కసరత్తు జరుగుతూనే ఉంది. తుది జాబితా పూర్తిగా కొ లిక్కిరాలేదు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికా రుల మధ్య సమయం, సమన్వయం కుదరకపోవడమే కారణంగా చెబుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్లు తక్కువ, ఆశావహులు ఎక్కువగా ఉండడంతో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఎటూ తేల్చలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేయడం కోసం గత నెల 29న రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉమ్మడి వరంగల్కు చెందిన కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ నెల 6 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టాలని ఆదేశించారు. మంత్రి ఇచ్చిన గడువు ముగిసినా లబ్ధిదారుల ఎంపిక అధికారులు, ప్రజాప్రతినిధులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు.
లబ్ధిదారుల ఎంపికపై
కొనసాగుతున్న కసరత్తు..
ఇందిరమ్మ కమిటీలతోపాటు అధికారులు పక్కాగా అర్హులను గుర్తిస్తున్నారు. ఎక్కడైనా అనర్హులకు ఇల్లు ఇస్తే అధికారులపై కఠిన చర్యలుంటాయని రాష్ట్ర మంత్రులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో లోపాలు లేకుండా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. గ్రామాలవారీగా వచ్చిన దరఖాస్తుల్లో ప్రాధాన్య క్రమంలో నిరుపేదలను గుర్తిస్తున్నారు. కాగా, గత నెల 29న వెల్లడించిన అధికారుల గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్కు 46,892 ఇళ్లు మంజూరు కాగా 38,551 ఇళ్లకు ఎంపీడీఓలు ఆమోదం తెలిపారు. ఇందులో 18,122లను ఆయా జిల్లాల కలెక్టర్లు ఆమోదించగా, 15,306 మంది లబ్ధిదారులకు మంజూరు ప త్రాలు ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్రెడ్డి సమీక్ష తరా ్వత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసే పనులపై కసరత్తు చేస్తున్నారు.
సమయం, సమన్వయలోపమే అసలు సమస్య..
లబ్ధిదారుల ఎంపిక ప్రగతిని ఇటీవల విడుదల చేసిన అధికారులు
జనగామలో 58.16 శాతం ప్రొసీడింగ్స్ జారీ.. 0.28 శాతానికే భూపాలపల్లి పరిమితం
ములుగు జిల్లాలో పెరగని వేగం.. మానుకోట, వరంగల్లలో 35, 36శాతం
39.94 శాతంలో హనుమకొండ.. సమీక్ష తర్వాత మారిన పరిస్థితి
నిర్మాణంపై దృష్టిసారించిన అధికారులు.. వేగం పెరిగితేనే సకాలంలో నిర్మాణం
జిల్లా కేటాయింపు ఎంపీడీఓలు కలెక్టర్లు ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్
ఆమోదించినవి ఆమోదించినవి సిద్ధమైనవి సిద్ధమైన శాతం
హనుమకొండ 10,621 7,156 4,950 4,242 39.94
వరంగల్ 11,459 7,080 3,422 2,979 36.00
జనగామ 6,202 5,183 3,667 3,607 58.16
మహబూబాబాద్ 9,745 6,945 3,703 3,447 35.37
ములుగు 4,175 7,247 1,423 1,018 24.38
భూపాలపల్లి 4,690 4,940 957 13 0.28
మొత్తం 46,892 38,551 18,122 15,306
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాం
ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకునేలా చూస్తున్నాం. ఓ వైపు మొదటి విడుత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ.. ప్రొసీడింగ్స్ జారీ, మరోవైపు ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగేలా చర్యలు చేపడుతున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులను కలిసి నిర్మాణాలకు ఎంత ఖర్చయిందని, నిర్మాణ సామగ్రిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారని తెలుసుకుంటున్నాం. పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు జరిగేలా అఽధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది.
– పి.ప్రావీణ్య, జిల్లా కలెక్టర్,
హనుమకొండ
జిల్లాల వారీగా స్పెషల్ టీమ్లు..
మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టేలా జిల్లాల వారీగా స్పెషల్ టీమ్లు వేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సమీక్షిస్తూ ఈ నెల 15లోగా వీలైనన్ని ఎక్కువ ఇళ్లు నిర్మాణం దిశగా ముందుకు సాగేలా దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో లబ్ధిదారుల తీరుని పరిశీలించి ఆమోదముద్ర వేస్తున్నారు. గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు దిశానిర్దేశం చేస్తూ వీలైనంత తొందరగా వీటి నిర్మాణం పూర్తయ్యేందుకు సహకరిస్తున్నారు. హనుమకొండలో 332 ఇళ్లు గ్రౌండింగ్ చేయగా, 156 బేస్మెంట్ లెవెల్కు చేరుకున్నాయి. వరంగల్లో 275 ఇళ్లకు 126, మహబూబాబాద్లో 287లకు 122, జనగామలో 405లకు 235, ములుగులో 595లకు 309, జేఎస్ భూపాలపల్లిలో 160 గ్రౌండింగ్ చేయగా, 68 బేస్మెంట్ లెవెల్కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో శనివారం నాటికి మొత్తంగా 82 ఇళ్ల వరకు స్లాబ్ లెవెల్కు చేరినట్లు అధికార వర్గాల సమాచారం.

‘ఇందిరమ్మ’ ఇళ్ల శ్లాబ్లు పడేదెప్పుడు?