
కేయూలో ఉద్యోగుల ఎన్నికల సందడి
● ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగుల ఎన్నికల సందడి నెలకొంది. కేయూలో ఎన్జీఓ, క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియకు ఇటీవలనే అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లను స్వీకరించారు. వివిధ పదవులకు నామినేషన్లను స్వీకరించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వివిధ పదవులకు నామినేషన్లు పోటీపోటీగా వేశారు. కేయూ ఎన్జీఓ అధ్యక్ష పదవికి నవీన్కుమార్, నిరంజన్, పోతు రాజు, జనరల్ సెక్రటరీగా తిరుపతి, నిరంజన్, అక్రమ్ మహ్మద్ నామినేషన్లు వేశారు. కోశాధికారి పదవికి దామోదర్, రాజు, సహెచ్ ప్రవీణ్కుమార్లు పోటీపడుతున్నారు. మిగతా పదవులకు నలుగురి చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. మహిళా కార్యదర్శి కోసం ముగ్గురు ఉద్యోగులు పోటీపడుతున్నారు. క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి గుమ్మయ్య, కోర్నెల్, నిజాముద్దీన్లు, జనరల్ సెక్రటరీ కోసం బొక్క మొగిలి ,అంకూస్లు నామినేషన్లు వేశారు. ఈనెల 13వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఓటింగ్ ఈనెల 20న నిర్వహించనున్నారు. 21న ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా టీచింగ్ నాన్ టీచింగ్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్ వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక జాబితాను రాత్రి 8 గంటలకు వెల్లడించారు.