
టీపీసీసీలో ఉమ్మడి జిల్లా నేతలకు కీలక పదవులు
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ తాజాగా 27 మంది నేతలకు పార్టీ ఉపాధ్యక్ష పదవి, 69 మందికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నమిండ్ల శ్రీనివాస్, లకావత్ ధన్వంతి, టి.కుమార్రావులను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు. అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఈవీ శ్రీనివాసరావు, కత్తి వెంకటస్వామి, మల్లాడి రాంరెడ్డిలకు అవకాశం దక్కింది.
ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా పలువురికి అవకాశం

టీపీసీసీలో ఉమ్మడి జిల్లా నేతలకు కీలక పదవులు

టీపీసీసీలో ఉమ్మడి జిల్లా నేతలకు కీలక పదవులు

టీపీసీసీలో ఉమ్మడి జిల్లా నేతలకు కీలక పదవులు

టీపీసీసీలో ఉమ్మడి జిల్లా నేతలకు కీలక పదవులు

టీపీసీసీలో ఉమ్మడి జిల్లా నేతలకు కీలక పదవులు