
అక్కినేని నాగార్జున ప్రస్తుతం కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించారు.

ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ముంబయిలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్కు హీరో నాగార్జున కూడా హాజరయ్యారు.










