లే నాన్నా.. అమ్మ, తమ్ముడు వచ్చాం | - | Sakshi
Sakshi News home page

లే నాన్నా.. అమ్మ, తమ్ముడు వచ్చాం

Jun 10 2025 3:40 AM | Updated on Jun 10 2025 3:42 AM

రేగొండ: నాన్న లే ఒకసారి.. అమ్మ, తమ్ముడు వచ్చాం అంటూ.. తండ్రి మృతదేహన్ని చూసి కూతురు విలవిల్లాడింది. రేపాకలో ట్రాక్టర్‌తో సహబావిలో పడి చనిపోయిన యువరైతు బోయిని తిరుపతి రాజ్‌ (30) మృతదేహం వద్ద అతడి కుమార్తె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన బోయిని తిరుపతి రాజ్‌ తన వ్యవసాయ భూమిలో రోటవేటర్‌తో దున్నేందుకు ఉద యం ట్రాక్టర్‌పై వెళ్లాడు. దున్నే క్రమంలో ట్రాక్టర్‌ రివర్స్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు సమీపంలోని వ్యవసాయ బావిలో పడ్డాడు. బావిలో నీరు లేకపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతి రాజ్‌ మృతదేహం మీద పడి భార్య, కూతురు, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. నాన్న లే .. నాన్న లే అంటూ దిక్కులు పిక్కటిలేలా కూతురు, కుమారుడు విలపించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బోయిని రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు. మృతుడికి భార్య సంధ్య, కూతురు, కొడుకు ఉన్నారు.

తండ్రి మృతదేహాన్ని చూసి

గుండెలవిసేలా రోదించిన కూతురు

ట్రాక్టర్‌తో సహా బావిలో పడి వ్యక్తి మృతి

రేపాకలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement