
ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు
మహబూబాబాద్ అర్బన్: గిరిజనుల భూముల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అక్రమంగా నిర్మాణం చేపట్టారని, ఆ స్కూల్ ప్రారంభానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ను గిరిజనులు అడ్డుకున్నారు. మహబూబాబాద్ మున్సిపల్ శనిగపురం పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఆదివారం గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేశ్నాయక్ మాట్లాడుతూ.. శనిగపురం రెవెన్యూ వీరారంతండాకు చెందిన మాజీ వార్డు కౌన్స్లర్ భూక్య శ్రీను కుటుంబానికి చెందిన(సర్వే నంబర్ 275, 278, 279లలో) సుమారు 30 ఎకరాల భూమిని డాక్టర్ జన్నపురెడ్డి ప్రమోద్రెడ్డి వారి అనుచరులతో కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ వ్యవస్థను తప్పుదోవ పట్టించారన్నారు. రెవెన్యూ ఉద్యోగులను, మున్సిపల్ ఉద్యోగులకు లంచాలు ముట్టజెప్పి అక్రమ మార్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రమోద్ హోమ్స్ పేరుతో గృహ నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ ప్రమోద్రెడ్డి గిరిజన భూములను సుమారు 30 నుంచి 60 ఎకరాలు కబ్జా చేసి ప్రస్తుతం ఆ భూముల్లో అనుమతులు లేకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో(డీపీఎస్ పేరును కలిగి ఉన్న డ్యూప్లికేట్ లోగో) నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఆ స్కూల్ యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్కు వినతిపత్రం అందజేయగా ఆయన ఆదేశం మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన విచారణలోనూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములు అక్రమించినట్లు తేలడంతో డాక్టర్ ప్రమోద్రెడ్డి, అతడి అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైందని చెప్పారు. ఇప్పటికై నా కలెక్టర్, ఎస్పీ స్పందించి భూములను అప్పగించి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై డీఈఓ రవీందర్రెడ్డిని వివరణ కోరాగా ఆన్లైన్లో మాత్రమే ప్రారంభానికి అనుమతులు వచ్చాయని, ఆరు నెలల్లో అన్ని పత్రాలు సరైన రీతిలో అందజేస్తే అనుమతులు వస్తాయని తెలిపారు. అనంతరం ‘గోబ్యాక్ ఎమ్మెల్యే’ అంటూ గిరిజనులు నిరసన తెలిపడంతో ఎమ్మెల్యే మురళీ నాయక్ వెనుతిరిగి వెళ్లిపోయారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభంలో చేదు అనుభవం
స్కూల్కు ఆన్లైన్లోనే అనుమతులు

ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు