అంబేడ్కర్‌ ఆశయ సాధన దిశగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయ సాధన దిశగా పనిచేయాలి

Jun 4 2025 1:11 AM | Updated on Jun 4 2025 1:11 AM

అంబేడ్కర్‌ ఆశయ సాధన దిశగా పనిచేయాలి

అంబేడ్కర్‌ ఆశయ సాధన దిశగా పనిచేయాలి

కేసముద్రం: అంబేడ్కర్‌ ఆశయ సాధన దిశగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఇనుగుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ కాంస్య విగ్రహన్ని వేం నరేందర్‌రెడ్డితోపాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మహబూబాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధిలో అందరిని భాగస్వాములను చేస్తామన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం చేసి ఆ తర్వాత రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యే భుక్యా మురళీనాయక్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిస్తోందన్నారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ మహబూబాబాద్‌ జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు వేదికపైను న్న వారంతా కృషి చేయాలన్నారు. ఐపీఎస్‌ మాజీ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యకు సంబంధించి నిధులు కట్‌ చేయొద్దన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నా యక్‌, గ్రాయత్రీ గ్రానైట్స్‌ అధినేత వద్దిరాజు కిషన్‌, కేసముద్రం మార్కెట్‌ చైర్మన్‌ గంట సంజీవరెడ్డి, కేసముద్రం, ధన్నసరి పీఏసీఎస్‌ల చైర్మన్లు దికొండ వెంకన్న, మర్రి రంగారావు, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు పప్పుల వెంకన్న, మాలమహానాడు అధ్యక్షుడు లింగాల రవికుమార్‌, తదితరులు పాల్గొన్నా రు. కాగా, మండలంలోని అర్పనపల్లిలో కురవి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధి పనులపై నరేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement