
గుంటూరులో రోడ్డు ప్రమాదం..
● గూడూరు వాసి మృతి
గూడూరు: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గూ డూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ట్రాక్టర్ డ్రైవర్ ఏదుల ఆదినారాయణ (52) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదినారాయణ వరంగల్లో ఓ ట్రాక్టర్ ఏజెన్సీలో డ్రైవర్గా పని చేస్తూ, ఇతర జిల్లాలు, ప్రాంతాలకు కొత్త ట్రాక్టర్లను తరలిస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గుంటూరు నుంచి చిత్తూరుకు ట్రాక్టర్ తరలిస్తుండగా ప్రకాశం జిల్లా కనిగిరి మండల పామర గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆదినారాయణ మృతిపై మండల కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరులో పోస్టుమార్టం అనంతరం మృతదేహం గూడూరుకు తీసుకొస్తున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉంది.