
కాజీపేట జంక్షన్ మీదుగా మరో ‘వందేభారత్’
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్–న్యూఢిల్లీ మధ్య వందేభారత్ స్లీపర్, ఏసీ క్లాస్ ఎక్స్ప్రెస్ను నడిపించనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ, దక్షిణ మధ్య రైల్వే అధికారులు టెక్నికల్గా స్పీడ్ ట్రాక్ సిద్ధం చేస్తున్నారని వారు తెలిపారు. కాగా, ఇప్పటికే సికింద్రాబాద్–నాగ్పూర్, నాగ్పూర్–సికింద్రాబాద్, సికింద్రాబాద్–విశాఖపట్నం, విశాఖపట్నం–సికింద్రాబాద్ మధ్య నాలుగు వందేభారత్ సర్వీస్లు నడుస్తున్న విషయం విధితమే. కాజీపేటలో నిర్మాణమవుతున్న వ్యాగన్షెడ్, కోచ్ఫ్యాక్టరీ, కాజీపేట ఫిట్లైన్లను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వందేభారత్ ఎక్స్ప్రెస్ను నడిపించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తుందని తెలిపారు. సికింద్రాబాద్–న్యూఢిల్లీ రూట్లో ప్రవేశపెట్టబోయే సర్వీస్లతో కలుపుకుని కాజీపేట జంక్షన్మీదుగా ఆరు వందేభారత్ రైళ్ల సర్వీస్లు ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.