
ఇంజనీర్లు.. సమస్యల పరిష్కారకర్తలు
హసన్పర్తి: ఇంజనీర్లు.. కొత్త ఆవిష్కరణలు, సమస్యకు పరిష్కారకర్తలని ఏపీ ప్రభుత్వ ఎయిరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారు డాక్టర్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో మూడో స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సతీశ్ రె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సార్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో వంద ర్యాంకింగ్లో స్థానం సంపాదించడం అభినందనీయమన్నారు. ఇన్నోవేషన్ రంగం, అటల్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానం సాధించడం సంస్థ పరంగా గొప్ప విజయమని పేర్కొన్నారు. దేశం విద్యారంగంలో ముందుకు దూసుకెళ్తోందని వివరించారు. ఏటా 1.4 మిలియన్ ఇంజనీర్లు తయారవుతున్నారని చెప్పారు. పబ్లికేషన్, పీహెచ్డీ పరంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. క్యాంటం టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు లాంటి రంగాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. దేశం రక్షణ రంగంలో స్వదేశి శక్తితో ముందుకు వెళ్తోందన్నారు. డ్రోన్స్, రాడార్లు, మిస్సైల్ వ్యవస్థల ద్వారా భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటిందన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ. వరదారెడ్డి.. పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కీరవాణి, ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ దీపక్గార్గ్, రిజిస్ట్రార్ అర్చనారెడ్డి, వైస్చాన్స్లర్లు మధుకర్రెడ్డి, డాక్టర్ అర్చనారెడ్డి, డాక్టర్ మహేశ్తో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రక్షణ రంగంలో
ముందుకు దూసుకెళ్తున్నాం
డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్
గౌరవ సలహాదారు సతీశ్ రెడ్డి
ఎస్సార్లో ఘనంగా
స్నాతకోత్సవ వేడుకలు

ఇంజనీర్లు.. సమస్యల పరిష్కారకర్తలు

ఇంజనీర్లు.. సమస్యల పరిష్కారకర్తలు

ఇంజనీర్లు.. సమస్యల పరిష్కారకర్తలు

ఇంజనీర్లు.. సమస్యల పరిష్కారకర్తలు