
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం
● మహాలక్ష్మి స్కిల్ డెవలప్మెంట్
డైరెక్టర్ మోహిత్
ఖిలా వరంగల్: మహిళలను పారిశ్రామిక వే త్తలుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని మ హాలక్ష్మి స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ మో హిత్, అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి అన్నారు. గురువారం వరంగల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాల స్వ యం సహయక మహిళా బృందాలకు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ర్పేనియర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ఆసక్తి గల మహిళలకు 15 రో జులపాటు పరిశ్రమల నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్ మెళుకువలు, నైపుణ్యాఅభివృద్ధి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సీసీలు గోలి కొ మురయ్య, కుమారస్వామి, శారద, మంజుల మహేందర్, పీఆర్పీలు కవిత, మౌనిక, మే నక, ఆలీ, సమస్త టీం సభ్యులు పాల్గొన్నారు