కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా బాధ్యతల స్వీకరణ

Jun 6 2025 1:00 AM | Updated on Jun 6 2025 1:00 AM

కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా బాధ్యతల స్వీకరణ

కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా బాధ్యతల స్వీకరణ

కేయూ క్యాంపస్‌: తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అప్పిలేట్‌ అథారిటీ సభ్యుడిగా కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, హనుమకొండకు చెందిన గాదె దయాకర్‌ హైదరాబాద్‌ నాంపెల్లిలోని కాలుష్య నియంత్రణ మండలి అప్పిలెట్‌ అథారిటీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్‌ అథారిటీ చైర్మన్‌ జస్టిస్‌ సాంబశివరావు నాయుడుతో కలిసి దయాకర్‌ బాధ్యతలు స్వీకరించారు.

గాదె దయాకర్‌కు అభినందనలు

కాజీపేట రూరల్‌: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అప్పిలేట్‌ అథారిటి సభ్యుడిగా ఎన్నికై న ప్రొఫెసర్‌ గాదె దయాకర్‌ను కాజీపేట దర్గా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌కే.అమర్‌, మట్టెడ కుమార్‌, మట్టెడ వేణు, తాళ్ల తిరుమల్‌, అంబాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement