
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
వరంగల్ అర్బన్ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బల్దియా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా బృందాల ఆధ్వర్యంలో (ఎస్హెచ్జీ) పలు డివిజన్లలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, హార్టికల్చర్ అసిస్టెంట్ అనూహ, సీఓలు శ్రీలత, సుజాత, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.
కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే