ఎయిడెడ్‌ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఎయిడెడ్‌ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి

Jun 12 2025 3:39 AM | Updated on Jun 12 2025 3:39 AM

ఎయిడెడ్‌ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి

ఎయిడెడ్‌ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి

విద్యారణ్యపురి: ఎయిడెడ్‌ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి హనుమకొండలోని పీఈఆర్‌టీయూ భవనంలో తెలంగాణ ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల జాక్‌ కన్వీనర్‌ ఎంకె. తన్వీర్‌ అధ్యక్షతన శ్రీపాల్‌రెడ్డి అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు. తన హైస్కూల్‌ విద్యాభ్యాసం ఎయిడెడ్‌ లోనే జరిగిందన్నారు. ఎయిడెడ్‌ టీచర్లకు ప్రతీ నెల ఆలస్యంగా వేతనాలు వస్తున్నాయన్నారు. ఆరోగ్య భద్రత, పదోన్నతులు, కారుణ్య నియామకాల సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎయిడెడ్‌ టీచర్ల జాక్‌ బాధ్యులు సీతారామాచారి, శ్రీధర్‌, శవకుమార్‌, సరళ, తిరునగరి నరేందర్‌, జాక్‌ కోకన్వీనర్‌ బెల్లంకొండ పూర్ణచందర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎం. తిరుపతిరెడ్డి, జిల్లా జనరల్‌ సెక్రటరీ ఫలితశ్రీహరి, బాధ్యులు తోట భిక్షపతి, శ్రీనివాస్‌, గఫార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement