
పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందిస్తాం
తొర్రూరు: ప్రభుత్వ పాఠశాలల్లో పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందిస్తామని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో గురువారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూని ఫాంలు పంపిణీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ ప్ర భుత్వ పాఠశాలల్లో అర్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారన్నారు. ఎంఈఓ బుచ్చయ్య, హెచ్ఎం లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉత్తమ పాఠశాలలుగా గుర్తింపు తెచ్చుకోవాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పాఠశాలలుగా గు ర్తింపు తెచ్చుకోవాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నా రు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా గురువారం మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు డప్పు చప్పుళ్లతో ఆహ్వానించారు. డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులు అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. హెచ్ఎంధారావత్ బద్రునాయక్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఈదులపూసపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం పూజారి వీరయ్య, ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్యప్రకాశ్, గొట్టిముక్కల పవన్ రాజ్, బొమ్మర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్ విద్యార్థులు ల్గొన్నారు.
పాఠ్యపుస్తకాల పంపిణీ
కురవి: మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ వి ద్యార్థులకు డీఈఓ రవీందర్రెడ్డి గురువారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఆయన పాఠశాలను సందర్శించారు. హెచ్ఎం మహమ్మద్ వహీద్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, రిటైర్డ్ టీచర్ వెంకట్రాంనర్సయ్య, ఉపాధ్యాయులు శ్రీధర్, విజ య్రాజ్, వెంకన్న, వెంకటేశ్వర్లు, నరసింహచారి, ప్రేమ్సాగర్, దేవి, యాకమ్మ, మల్లికార్జున్రావు, రాజు, రత్నమాల, పద్మలత పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్రెడ్డి