
ప్రైవేట్కు పరుగు..
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో డయోగ్నోస్టిక్స్ ల్యాబ్, రేడియాలజిహబ్ను ఏర్పా టు చేశారు. అయితే రోగులకు మాత్రం అక్కడ పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి సీటీ స్కానింగ్, ఎక్స్రే ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. కానీ, రేడియాలజిహబ్లో సరిపడా టెక్నీషియన్స్ లేకపోవడంతో సాయంత్రం తర్వాత స్కానింగ్, ఎక్స్రే సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి.
వేధిస్తున్న కొరత..
టెక్నీషియన్లు, రేడియాలజిస్టుల కొరత కారణంగా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. రేడియాలజి హబ్లో 9మంది టెక్నీషియన్లకు గానూ ఇద్దరు మాత్రమే ఉండడంతో సాయంత్రం 4 గంటల వరకే సేవలు అందిస్తున్నారు. సాయంత్రం, రాత్రి వేళ, అత్యవసర సమయాల్లో ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోందని రోగులు తెలుపుతున్నారు. ఆదివారం సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. పెద్దాస్పత్రిగా అప్గ్రేడ్ అయినప్పటికీ పేదలకు అందాల్సిన వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా.. ఆదిశగా అడుగులు పడడం లేదు.
జీజీహెచ్లో అందని స్కానింగ్, ఎక్స్రే సేవలు
అత్యవసర సమయంలో
ప్రైవేట్ బాట పడుతున్న రోగులు
ఖాళీగా టెక్నీషియన్ పోస్టులు
కలెక్టర్కు నివేదించాం
ఆస్పత్రిలోని రేడియాలజిహబ్లో ఇద్దరు మాత్రమే టెక్నీషియన్లు ఉన్నారు. ఏడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, కలెక్టర్ భర్తీ ప్రక్రియను పెండింగ్లో ఉంచారు. చాలా సార్లు కలెక్టర్కు నివేదించాం. 72 పోస్టుల్లో టెక్నీషియన్లు, మెకానిక్, డ్రైవర్లు, సిబ్బంది ఇతర పోస్టులు ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేస్తే పూర్తిస్థాయిలో సేవలు అందుతాయి. తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవలు అందిస్తున్నాం.
– శ్రీనివాసరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్