విద్యార్థుల బడిబాట.. | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల బడిబాట..

Jun 13 2025 5:07 AM | Updated on Jun 13 2025 5:07 AM

విద్య

విద్యార్థుల బడిబాట..

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లావ్యాప్తంగా ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. చిన్నారులు ఆటపాటలకు గుడ్‌బై చెప్పి పాఠశాలలకు తొలిరోజు వెళ్లారు. 45 రోజులపాటు వేసవి సెలవులను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు బడిబాటపట్టారు. ఇన్ని రోజులు బోసిపోయిన పాఠశాలలు విద్యార్థుల రాకతో కళకళలాడాయి. ఉదయాన్నే తల్లిదండ్రులు, బంధువులు తమ పిల్లలను పాఠశాలల వద్ద దింపారు. కొందరు చిన్నారులు నవ్వుతూ వెళ్లగా.. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారులు ఏడుస్తూ మారం చేస్తూ కనిపించారు. కాగా బుక్‌స్టాళ్లు, షూమార్ట్‌లు, బట్టల షాపులు విద్యార్థులతో కిక్కిరిశాయి.

హాజరు అంతంతే..

తొలిరోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా సమయానికి హాజరుకాలేదు. పాఠాలు బోధించలేదు. వచ్చిన విద్యార్థులు స్కూల్‌ ఆవరణలో ఆడు తూ, పాడుతూ కనిపించారు. సర్కారు పాఠశాలకు భిన్నంగా ప్రైవేట్‌ స్కూళ్లు విద్యార్థులతో కళకళలా డాయి. అధికశాతం విద్యార్థులు హాజరయ్యారు.

సమస్యల స్వాగతం..

ప్రతి ఏటా మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు స్వాగతం పలికాయి. చాలాచోట్ల తాగునీరు, విద్యుత్‌ అంతరాయం, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో సమస్యలు దర్శనమిచ్చాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొన్ని పాఠశాలల్లో కిటికీలు సరిగాలేక, ఫ్యాన్లు తిరగక విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. కాగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. మరికొన్ని పాఠశాలల్లో యూనిఫాం అందజేశారు. జిల్లాలోని పలు తండాల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయులు లేని పాఠశాలలు కొన్ని తెరుచుకోలేదని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. విద్యార్థులు ఎదురుచూసి తిరిగి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని హనుమంతునిగడ్డ, గుమ్ముడూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల హెచ్‌ఎంలు హల్యానాయక్‌, ఝాన్సీరాణి, ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో ఎంఈఓ శీలం వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు.

సమయానికి

ఉపాధ్యాయులు హాజరుకావాలి

ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో హాజరుకావాలి. అదేవిధంగా గైర్హాజరైన, పాఠశాలలు సమయానికి తీయని ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేవిధంగా నడుచుకోవాలి.

– రవీందర్‌రెడ్డి, డీఈఓ

పూలతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు

మొదటి రోజు పాఠశాలలకు

వెళ్లేందుకు ఆసక్తిచూపని స్టూడెంట్స్‌

విద్యార్థుల బడిబాట..1
1/3

విద్యార్థుల బడిబాట..

విద్యార్థుల బడిబాట..2
2/3

విద్యార్థుల బడిబాట..

విద్యార్థుల బడిబాట..3
3/3

విద్యార్థుల బడిబాట..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement