బీసీ సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చాలి | - | Sakshi
Sakshi News home page

బీసీ సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చాలి

Jun 12 2025 3:41 AM | Updated on Jun 12 2025 3:41 AM

బీసీ సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చాలి

బీసీ సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చాలి

విద్యారణ్యపురి: తరాలుగా ఉత్పత్తి శ్రమలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీ సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చడమే లక్ష్యమని ఆల్‌ ఇండియా ఓబీసీ జాక్‌ చైర్మన్‌ సాయిని నరేందర్‌ అన్నారు. బుధవారం హనుమకొండలోని టీఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించిన ఆ ఓబీసీ జాక్‌ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజహితం కోసం నిత్యం శ్రమ చేస్తున్న బీసీ సమాజం నేడు బతకలేక ఎంతో మంది బలిదానాలు చేసుకుంటున్నారన్నారు. బీసీ సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చి చట్టసభల్లో వాటా సాధించాలని పిలుపునిచ్చారు. సమాజంలో బీసీ సంఘాలు విడిపోయి పాలకవర్గాలకు పావులుగా మారాయన్నారు. విడిపోయిన కుల, బీసీ సంఘాలను ఐక్యం చేయడమే ఓబీసీ లక్ష్యమన్నారు.

ఏఐఓబీసీ జిల్లా కమిటీ ఎన్నిక

ఈ సమావేశంలో ఏఐఓబీసీ కమిటీని ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా తాడిశెట్టి క్రాంతి కుమార్‌ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి వీరస్వామి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా పి. వెంకటాచారి, కోశాధికారిగా తాడూరి మోహన్‌, ఉపాధ్యక్షులుగా వల్లాల జగన్‌ గౌడ్‌, తాటికొండ సద్గుణ, నవీన్‌కుమార్‌, రాచమల్ల శ్రీనివాస్‌, మహ్మద్‌ ఇస్మాయిల్‌, సెక్రటరీలుగా నిరంజన్‌, కృష్ణమూర్తి, రవికుమార్‌, నారాయణగిరి రాజు ఎన్నికయ్యారు. సలహాదారులుగా పులి రజనీకాంత్‌, గౌరవ అధ్యక్షుడిగా పులి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ సోమ రామ్మూర్తి, బీసీ పొలిటికల్‌ జాక్‌ నాయకులు మాదం రజనీకుమార్‌, జాక్‌ బాధ్యులు కె. రంజిత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆల్‌ఇండియా ఓబీసీ చైర్మన్‌

సాయిని నరేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement