
ఆయుర్వేద అవసరం పెరిగింది
జనగామ: ఆధునిక యుగంలో ఆయుర్వేద వైద్యా నికి ఉన్న అవసరం మరింత పెరిగిందని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని వేద పంచ కర్మ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్, తెలంగాణ విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో ఆయుర్వేద విద్యార్థులకు స్టేట్లెవల్ కౌశలం–2025 ఐదురోజుల ప్రోగ్రాం బుధవారం ప్రారంభమైంది. ‘వేద’ హాస్పిటల్ డాక్టర్ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతి థిగా పాల్గొని శిక్షణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టేట్లెవల్లో జరిగే శిక్షణలో విద్యార్థులకు పాఠ్యాంశాల్లోనే లేని అనేక ప్రామాణిక విషయాలను నేర్చుకునే గొప్ప అవకాశం కలు గుతుందన్నారు. ఒత్తిడి, జీవనశైలి రుగ్మతలు, నడు ము, మెడ నొప్పి వంటి సమస్యలకు సహజ పరి ష్కారం ఆయుర్వేద వైద్యమన్నారు. జిల్లాలో ఈ త రహా ఆరోగ్యవంతమైన కార్యక్రమాలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై దృష్టి సారించాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్కు సూ చించారు. ఆయుర్వేద వైద్యాధికారులను సమన్వయం చేసుకుంటూ ఈ వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి సుమారు వంద మందికి ఉచితంగా మందులు అందించారు. అంతకు ముందు డాక్టర్ అంజిరెడ్డి రచించిన ‘వై టూ చాయిస్ వేద’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వ ఆయుర్వేద పరిషత్ వైస్ ప్రెసిడెంట్ టి.ప్రేమానంద్రావు, వీఏపీ ప్రెసిడెంట్ ఎస్. శారంగపాణి, వీఏపీ జనరల్ సెక్రటరీ, బి.కిషన్, హైదరాబాద్ బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్యుడు, కల్నల్ బిక్షపతి, డాక్టర్లు యశోదా, మమతా, సురేశ్ జకోటియా తదితరులు పాల్గొన్నారు. కాగా 15వ తేదీ వరకు స్టేట్లెవల్ కౌశలం ప్రోగ్రాం కొనసాగనుంది.
ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు సహజ పరిష్కారం
జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా
స్టేట్ లెవల్ కౌశలం–2025
శిబిరం ప్రారంభం