
అంతా నా ఇష్టం..
ఓ ఆర్టీసీ డిపోలో ఆ అధికారి తీరే వేరు!
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఓ డిపో (జిల్లా కేంద్రం బయట)లో ఓ అసిస్టెంట్ మేనేజర్ తీరుపై కార్మిక వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆ అధికారి తీరే వేరంటూ కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా డబుల్ డ్యూటీలు చేసినా సాధారణ సెలవు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మిక వర్గాలు వాపోయాయి. కార్మికుల విధులు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే ఈ అధికారి.. తన వరకు వస్తే మాత్రం తనకు రూల్స్ ఉండవని చెప్పకనే తన వైఖరి చాటుకుంటున్నారని కార్మికులు పేర్కొంటున్నారు. ఉద్యోగ రీత్యా స్థానికంగా ఉండాల్సిన ఈ అధికారి.. పొరుగున ఉన్న పూర్వ జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తూ తనకు అనుకూలంగా బస్ షెడ్యూల్ను నిబంధనలకు విరుద్ధంగా మార్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ నైట్ హాల్ రద్దు..
ఆ డిపో నుంచి హైదరాబాద్కు నడిచే యూపీఎల్–02 షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో నైట్ హాల్ చేయాల్సి ఉండగా తాను ప్రతీ రోజు పూర్వ జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా హైదరాబాద్ నైట్ హాల్ రద్దు చేసి, తాను నివాసముండే పూర్వ జిల్లా కేంద్రానికి నడించుకుంటున్నారని ఆ డిపో కార్మికులు పేర్కొంటున్నారు. కిలో మీటర్లు చూపించుకునేందుకు ప్రయాణికుల రద్దీ లేని రూట్లలోనూ బస్సులు తిప్పుతున్నారని కార్మి కులు వివరించారు. ఇంత జరుగుతున్న ఆ డిపో మేనేజర్ చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు తె లిసే జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసరాలకు కూడా సెలవులు ఇవ్వ డం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తన అవసరాల కోసం నిబంధనలు కాలరాసే ఆ అధి కారి.. ఉద్యోగుల అవసరాలను పట్టించుకోవడం లే దని, ఇది వేధింపులకు గురి చేయడమేనని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్ప టికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
డబుల్ డ్యూటీలు చేసినా
కార్మికులకు సెలవు ఇవ్వరు..
ఆమె కోసం బస్ షెడ్యూల్నే
మార్చిన అధికారులు
ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న కార్మికులు