6న ఎస్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం | - | Sakshi
Sakshi News home page

6న ఎస్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం

Jun 4 2025 1:11 AM | Updated on Jun 4 2025 1:11 AM

6న ఎస

6న ఎస్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం

హసన్‌పర్తి: ఎస్సార్‌ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవ వేడుకలు ఈనెల 6న ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈమేరకు మంగళవారం ఎస్సార్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ దీపక్‌ గార్గ్‌ ప్రకటించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ గౌరవ సలహదారు, ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ జి. సతీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం సందర్భంగా కీరవాణికి డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నట్లు దీపక్‌గార్గ్‌ తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అర్చనారెడ్డి, డైరెక్టర్‌ డాక్టర్‌ మహేశ్‌, స్నాతకోత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు

హన్మకొండ: రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు ఆర్‌.ఉమారెడ్డి తెలిపారు. మంగళవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విత్తనమేళాతోపాటు ‘నాణ్యమైన విత్తనం – రైతుకు నేస్తం’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వరంగల్‌ పైడిపల్లిలోని వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తనమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.ఉమారెడ్డి పాల్గొని రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమకు అందజేసిన నాణ్యమైన విత్తనాన్ని ఎవరి గ్రామాల్లో వారే పండించుకోవాలన్నారు. తద్వారా సాగు ఖర్చు తగ్గడమే కాకుండా ప్రైవేట్‌ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరముండదన్నారు. ఈ క్రమంలో ప్రతీ గ్రామంలో రైతులు విత్తనాన్ని పండించుకోవడానికి వీలుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మూల విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. శాస్త్రవేత్తలు అవసరమైన మెళకువలు నేర్పుతున్నారన్నారు.

పదవీ విరమణ అభినందన సభ

మడికొండ: విద్యుత్‌శాఖ ఏడీఈ నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు పదవీ విరమణ సభ మంగళవారం రాత్రి మడికొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ( సీతక్క) హాజరై సన్మానించారు. ఉద్యోగంలో పదవి విరమణ సాధారణమని, వృత్తి పరంగా ఆయన సేవలను సంస్థ సద్వినియోగం చేసుకుంటుందన్నారు. కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, సుస్మితా పటేల్‌, ఈవీ శ్రీనివాసులు, విద్యుత్‌శాఖ అధికారులు, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

6న ఎస్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం 
1
1/3

6న ఎస్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం

6న ఎస్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం 
2
2/3

6న ఎస్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం

6న ఎస్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం 
3
3/3

6న ఎస్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement