
ఆశ్రమ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలి
● ఐటీడీఏ పీడీ చిత్రమిశ్రా
మహబూబాబాద్ అర్బన్: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను పాఠశాలల పునఃప్రారంభమైయ్యే నాటికి ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సుందరంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీడీ చిత్ర మిశ్రా అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని ముత్యాలమ్మ గూడెం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను శనివారం సందర్శించి మాట్లాడారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎంలు, వార్డెన్లు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లు, డైనింగ్, రూఫ్, కాంపౌండ్ వాల్, మైనర్, మేజర్ రిపేర్లు మరమ్మతు చేయించాలన్నారు. త్వరలో 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఉత్తమ విద్యార్థులను గుర్తించి అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఉపసంచాలకులు దేశీరాం, హెచ్ఎం కోటేశ్వరి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఏఐపై శిక్షణ
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు విద్యారంగంలో కృత్రిమ మేథ (ఏఐ)పై శిక్షణను గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన శాఖ అధికారి దేశిరామ్ నాయక్ శనివా రం తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న 360 మంది ఉపాధ్యాయులకు, 109 సీఆర్టీలకు విద్యారంగంలో కృత్రిమ మేథ పాత్రపై జూమ్/వెబెక్స్ ఆన్లైన్ వేది కల ద్వారా అవగాహన తరగతులను ఈనెల 28 నుంచి మే 30వరకు నిర్వహించనున్నట్లు తెలి పారు. జిల్లాలో మొత్తం 469 మంది ఉపాధ్యాయులను 15బ్యాచులుగా విభజించి ఒక్కో రోజు ఒక్కో బ్యాచ్కు 6 సెషన్ల చొప్పున ఉద యం 10గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నామని, తప్పనిసరి గా ఉపాధ్యాయులు హాజరు కావాలన్నారు.
జడ్జి తిరుపతికి వీడ్కోలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా మూడున్నర సంవత్సరాల పాటు పనిచేసి మేడ్చల్ మల్కాజిగిరికి బదిలీపై వెళ్తున్న జూనియర్ సివిల్ జడ్జి తిరుపతికి న్యాయశాఖ ఉద్యోగులు శనివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన సేవలను కొనియాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ కోర్టులోనే కాకుండా లోక్ అదాలత్లో వేలా ది కేసులను పరిష్కరించి ప్రత్యేక స్థానాన్ని ఏ ర్పరచుకున్నారన్నారు. ఈకార్యక్రమంలో సీని యర్ సివిల్ జడ్జి శాలిని శాకెల్లి, జిల్లా కోర్టు పరి పాలనాధికారి క్రాంతికుమార్, సీనియర్ సూపరిండెంట్లు శైలజ, మూర్తి, సంతోష్ కుమార్, డోలి అనిల్, వెంకన్న, అమరేందర్, పూస శ్రీని వాస్, పోలేపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
చట్టబద్ధ దత్తతతోనే
పిల్లలకు హక్కులు
నెహ్రూసెంటర్: పిల్లలను చట్టబద్ధ దత్తతతోనే హక్కులు లభిస్తాయని బాలల సంరక్షణ అధి కారి నరేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీపూజిత నర్సింగ్లో శనివారం సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ అధికారి నరేష్, డాక్టర్ ఇంద్రాసేనారె డ్డి మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేయడం నేరమని, పిల్లలు వద్దు అనుకునే వారు ప్రభుత్వానికి అప్పగించవచ్చన్నారు. అనంతరం దత్తతకు సంబంధించిన కరపత్రాలను ఆస్పత్రి సి బ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే
విక్రయించాలి
పెద్దవంగర: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్ధతు ధర పొందాలని జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి నర్సింహరావు, ఆర్డీఓ గణేష్ అన్నారు. శనివారం మండలంలోని చిట్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు వేర్వేరుగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు.

ఆశ్రమ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలి