
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్
కురవి: ప్రతీ ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలను నివారించి మలేరియాకు అడ్డుకట్ట వేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రం నుంచి గుడి సెంటర్ వరకు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల దోమలు వస్తాయని తెలిపారు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్బాల్స్ వేయాలని, ప్రతీ శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించాలని సూచించారు. పీహెచ్సీ డాక్టర్ విరాజిత, మలేరియా ప్రోగ్రాం అధికారి సుధీర్రెడ్డి, ప్రసాద్, పురుషోత్తం, గోపిచంద్, శ్రీహరి, గౌసీద్దున్, స్వా మి, సత్యం తదితరులు పాల్గొన్నారు.