
ఆ సినిమాలకు అవార్డులు తిరస్కరించాలి
న్యూశాయంపేట: పుష్ప –2 సినిమాలో స్మగ్లర్ పా త్ర పోషించిన అల్లు అర్జున్కు, రజాకార్ సినిమాకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులను తిరస్కరించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకుడు మో తె లింగారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం ముగింపు సమావేశంలో శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను అవమానపరుస్తూ తీసిన రజాకార్ సినిమాకు ఉత్తమ చారిత్రక వారసత్వ సినిమా అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి, మూడు వేల గ్రామాలను విముక్తి చేసి, 10 లక్షల ఎకరాల భూములను పంచిపెట్టిన చరిత్ర ఎర్రజెండా పార్టీకే దక్కిందని గుర్తుచేశారు. ఆనాడు పటేల్ సైన్యాలతో గ్రామాలపై విరుచుపడి ప్రజలపై కాంగ్రెస్ పార్టీ దాడి చేసి చంపించిందని, నేడు అదేతీరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ తీసిన సి నిమాలకు ఉత్తమ సినిమా అవార్డులు ఇవ్వడం అమరవీరులను అవమానపరచడమే అని అన్నా రు. అలాగే మూఢనమ్మకాలు, అశాసీ్త్రయ భావజాలాన్ని పెంపొందిస్తూ వచ్చిన కల్కి సినిమాకు కూడా ఉత్తమ సినిమా అవార్డు రావడం భారత సమాజాన్ని మూఢ విశ్వాసాల వైపు తీసుకెళ్లడమేనని చెప్పారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, రాష్ట్ర సమితి సభ్యురాలు మండ సదాలక్ష్మి, ఎన్.అశోక్ స్టాలిన్, డాక్టర్ మార్క శంకర్ నారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, కార్యవర్గ సభ్యులు మంచాల రమాదేవి, కర్రె లక్ష్మణ్, మునిగాల భిక్షపతి, బాషబోయిన సంతోష్, జక్కు రాజుగౌడ్, బత్తిని సదానందం పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
తక్కళ్లపల్లి శ్రీనివాసరావు