అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా | - | Sakshi
Sakshi News home page

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా

Jun 1 2025 12:52 AM | Updated on Jun 1 2025 12:52 AM

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా

విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నరేష్‌

నెహ్రూసెంటర్‌: జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జె.నరేష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలం నిరంతరం విద్యుత్‌ సరఫరా చేసేలా, కరెంట్‌ ఆటో జనరేట్‌ అయ్యేలా పరిశీలించామని, అంతరాయం కలగకుండా ఆస్పత్రులకు విద్యుత్‌ సరఫరా చేస్తామని తెలిపారు. సర్కిల్‌ కార్యాలయంలో జిల్లా కేబుల్‌ ఆపరేటర్స్‌తో సమావేశాన్ని నిర్వహించారు. విద్యుత్‌ పోల్స్‌ ద్వారా కేబుల్‌ వైర్లు, నెబ్‌ కేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారని, ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యుత్‌ పోల్స్‌ వినియోగంపై చార్జీల వసూలుపై ఆపరేటర్స్‌కు తెలియజేశారు. సమావేశంలో డీఈ విజయ్‌, ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ జగదీశ్వర్‌, ఏఈ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement