
అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
మహబూబాబాద్: రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అౖద్వైత్కుమార్సింగ్ అన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్ఓ విశాల్, అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్తో కలిసి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ కలెక్టరేట్లో శనివారం రాష్ట్ర అవతరణ వేడుకలు, వనమహోత్సవం, భూభారతి చట్టంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ హాజరవుతున్నారని, ప్రొటోకాల్ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రాంగణంలో శానిటేషన్, సౌండ్సిస్టం, సాంస్కృతిక కార్యక్రమాలు ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై గ్రామ రెవెన్యూ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరించాలని తెలిపారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ గ్రామసభలు నిర్వహించాలన్నారు. జిల్లాలో వన మహోత్సవం నిర్వాహణకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, డీఏఓ విజయ నిర్మల, డీఎస్సీఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఈఓ రవీందర్రెడ్డి, డీఎంహెచ్ఓ రవి రాథోడ్, కలెక్టరేట్ ఏఓ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా
అమలు చేయాలి
వన మహోత్సవం లక్ష్యాలను
పూర్తి చేయాలి
సమీక్షలో కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్