కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం

May 31 2025 1:04 AM | Updated on May 31 2025 1:04 AM

కాళేశ

కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం

త్రివేణి సంగమం వద్ద పెరిగిన నీటిమట్టం

బొగత జలపాతం వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు

ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు శుక్రవారం తరలివచ్చారు. అడపాదడప కురుస్తున్న వర్షాలకు గుట్టలపైనున్న వాగు పొంగడంతో ఆ నీరు బొగతకు వచ్చి చేరుతోంది. దీంతో జలపాతం వద్ద కనువిందు చేస్తున్న జలధారలను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం పెరిగింది. ఇటీవల ఎగువన అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి, ప్రాణహిత నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం 3వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు తరలిపోతోంది. గత వారం 1,800 – 2,200 క్యూసెక్కుల వరకు ప్రవాహం తరలిపోయింది.

బొగతలో పర్యాటకుల సందడి

– కాళేశ్వరం

– వాజేడు

కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం1
1/1

కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement