
భూభారతి చట్టం రైతులకు చుట్టం
దంతాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రైతులకు చుట్టంలా పని చేస్తుందని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. మండలకేంద్రంలోని బాలా జీ ఫంక్షన్ హాల్లో మంగళవారం భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి కంటే అన్నివిధాలా భూ భారతి చట్టం మెరుగ్గా ఉంటుందన్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకే ఈ చట్టం తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, నిజాం భూములు, నయీ మ్ భూములు కొట్టేసేందుకు ధరణి తెచ్చిందన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో గ్రామాల్లో అధికారులను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జూన్ నుంచి భూసమస్యలు పరిష్కరించనుండగా.. దంతాలపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మే నెల నుంచే సమస్యలు తీర్చనున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, డీఏఓ విజయనిర్మల, అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఏడీఏ విజయచంద్ర, తొర్రూ రు ఆర్డీఓ గణేశ్, తహసీల్దార్ సునీల్కుమార్, ఆర్ఐలు తదితరులు ఉన్నారు.