
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
● 10 మందిపై కేసు నమోదు
కురవి: దారి విషయంలో జరిమానా విధించి, తిట్టి కొట్టి అవమానించడంతో ఓ వ్యక్తి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీరోలు ఎస్సై నగేష్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లసంకీస శివారు బిల్యాతండా గ్రామానికి చెందిన వాంకుడోత్ బాలు (53)కు అదే తండాకు చెందిన అతని బావ బానోత్ శంకర్ల మధ్య నడిచేదారి విషయమై ఏప్రిల్ 28న గొడవ జరిగింది. దీంతో ఈ విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి బాలుకు రూ.25వేల జరిమానా విధించి అతిని బావ శంకర్కు ఇచ్చారు. దీంతో నా దగ్గర రూ.25వేలు తీసుకుంటావా? అని బావ శంకర్తో మళ్లీ గొడవ పడ్డాడు. ఈ సమయంలోనే కటారియా గోపిసింగ్, కిరణ్సింగ్, రాజేష్, వినోద్, బానోత్ మోహన్, వెంకన్న, రాజేష్, మోహన్, కమిలి, శంకర్ అందరూ కలిసి బాలును తిడుతూ, కాళ్లతో తన్ని అవమానపర్చారు. దీంతో బాలు అవమానం భరించలేక మనస్తాపంతో పొలం దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బాలు మృతికి కారణమైన పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేష్ తెలిపారు.