రాజ్యాంగ పరిరక్షణే ఎజెండా కావాలి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణే ఎజెండా కావాలి

Apr 30 2025 12:13 AM | Updated on Apr 30 2025 12:13 AM

రాజ్యాంగ పరిరక్షణే ఎజెండా కావాలి

రాజ్యాంగ పరిరక్షణే ఎజెండా కావాలి

నెహ్రూసెంటర్‌: రాజ్యాంగ పరిరక్షణే ప్రతి ఒక్కరి ఎజెండా కావాలని జాతీయ మాలమహానాడు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని వీఆర్‌ఎన్‌ గార్డెన్‌ గద్దర్‌ ప్రాంగణంలో మంగళవారం మాలమహానాడు ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ పరిరక్షణ సదస్సు’ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. సబ్బండ వర్గాల ప్రజలు రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సుమారు 52 వేల మంది ఉద్యమకారులు ఉన్నారని, వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌పై మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ దయాకర్‌ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌, హరికోట్ల రవి, సూర్నపు సోమయ్య, మైస శ్రీనివాస్‌, బి.అజయ్‌సారథిరెడ్డి, దార్ల శివరాజ్‌, గుగ్గిళ్ల పీరయ్య, అశోద భాస్కర్‌, గుగులోత్‌ కిషన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement