
కర్రిగుట్టలో కాల్పులు నిలిపివేయాలి
నయీంనగర్: ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని ఊసురు కర్రిగుట్టలో కాల్పులు నిలిపివేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర నేత ప్రొఫెసర్ హరగోపాల్ కో రారు. శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మధ్యభారతంలో ఆదివాసీల హనణాన్ని ఆపివేయాలని కోరారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగం అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలన్నారు. బ్రిటీష్ కాలం నుంచి మావోయిస్ట్ పార్టీ ఉందని, ఆదివాసీలు బలవుతున్నారని అన్నారు. ఆదివాసీ ప్రజలు భయానక వాతావరణంలో ఉన్నారని, కేంద్రం శ్మశానంలో చర్చలు జరపాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. మధ్యభారతంలో అపారవిలువైన ఖనిజ వనరులను దేశ, విదేశీ వాణిజ్య సామ్రాజ్యవాదులు కార్పొరేట్లతో ఒప్పందాలు చేసుకొని అందులో భాగంగా ఆదివాసులు వారికి అండగా ఉన్న మావో యిస్టులను అంతంచేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించి పాలన సాగిస్తోందన్నారు. సమాజ కోరిక మేరకు కేంద్రం ముందుకు రావాలని, ఏకపక్ష హనణాన్ని దేశ ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారన్నారు. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఇన్నారెడ్డి, రవిచందర్, తిరుపతయ్య, కుమారస్వామి, ఎం.శంకర్, శాంతి, గంగా ధర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టులతో ప్రభుత్వాలు
చర్చలు జరపాలి
పౌరహక్కుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్