
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి
కాజీపేట అర్బన్ : విద్యార్థులు సెల్ఫోన్లు వీడి, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని సాధించేందుకు కృషి చేయాలని ఏఐసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు ఆదివారం హంటర్రోడ్డులోని గౌడ హాస్టల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గౌడ విద్యార్థులకు గోపా ( గౌడ అఫిషీయల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ప్రతిభాపురస్కారాల అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గోపా ఆధ్వర్యంలో గౌడ విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డులు నేటి పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుతున్న విద్యార్థులను ఉత్తేజపరిచేందుకు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గోపా అధ్యక్షులు చిర్రరాజుగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, రాష్ట్ర గోపా మాజీ అధ్యక్షుడు విజయ్భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.శ్రీనివాస్గౌడ్, గౌడ ప్రతిభా పురస్కార్ కార్యక్రమ కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్, సీనియర్ నాయకులు పెద్ది వెంకట్నారాయణగౌడ్, బూర విద్యాసాగర్గౌడ్, తాళ్లపెల్లి జనార్ధన్గౌడ్, బోనగాని యాదగిరిగౌడ్, ఏసీపీ నాగయ్యగౌడ్, మార్క విజయ్గౌడ్, పోగాకు అశోక్గౌడ్, సురేశ్, కుమారస్వామి, బత్తిని రమేశ్, అంబాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ ఓబీసీ కోఆర్డినేటర్
కత్తి వెంకటస్వామి
గౌడ విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు అందజేత