పాముకాటుతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో రైతు మృతి

Jun 2 2025 1:24 AM | Updated on Jun 2 2025 1:24 AM

పాముక

పాముకాటుతో రైతు మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌: పాముకాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని విశ్వనాథపురంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రపు ఎల్లయ్య(54) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తన వ్యవసాయ బావి వద్ద పశువులకు మేత వేస్తుండగా పాము కాటు వేసింది. గమనించని ఎల్లయ్య యథావిధిగా ఇంటికి వచ్చాడు. కాలుకు కాటువేసిన చోట స్వల్పంగా రక్తస్రావం అవుతుండగా కట్టె గీసుకుందని భావించాడు. అనంతరం కాస్త నలతగా ఉండటంతో పాము కాటు వేసి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు ఎల్లయ్యను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం తరలించగా అదేరోజు రాత్రి మృతిచెందాడు.

విద్యుత్‌ తీగలే యమ పాశాలై..

తెగిపడిన తీగలు తగిలి వ్యక్తి మృతి

చెర్లపాలెంలో ఘటన

తొర్రూరు రూరల్‌ : విద్యుత్‌ తీగలు యమపాశాలయ్యా యి. రోడ్డుపై తెగిపడిన విద్యుత్‌ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తొర్రూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్‌ కథనం ప్రకారం.. పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన వల్లపు అశోక్‌ (45) శనివారం జలగం మల్లయ్యతో కలిసి పని నిమిత్తం బైక్‌పై చెర్లపాలెం వెళ్తున్నారు. ఈ క్రమంలో చెర్లపాలెం శివారులో 11 కేవీ విద్యుత్‌ తీగలు తెగి రోడ్డుపై పడి ఉన్నాయి. చూడకుండా బైక్‌ నడపడంతో తీగలు వాహనానికి తగిలి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తొర్రూరులో ఓ పైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వరంగల్‌ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అశోక్‌ అదేరోజు రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్‌ తెలిపారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..

రూ.14లక్షల నగదు,

ఐదున్నర తులాల బంగారం అపహరణ

ఖిలా వరంగల్‌ : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జ రిగింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి వరంగల్‌ గాంధీనగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెంది న చాతరాజు రేణుక ఇంటికి తాళం వేసి శనివారం క క్కిరాలపల్లిలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఆదివారం ఉదయం ఇంటికి రాగా ఇంటి తాళం తీసి ఉండడంతో చోరీ జరిగిందని గ్రహించి మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఎస్సై సురేశ్‌ క్లూస్‌ టీమ్‌తో కలిసి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరు పరిశీలించారు. బీరువాలో దాచిపెట్టిన ఐదు న్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.14లక్షల నగదు చోరీకి గురైందని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కొత్తవాడలో

పదితులాల బంగారం..

రామన్నపేట : వరంగల్‌ కొత్తవాడలో ఆదివారం సా యంత్రం సక్కుబాయ్‌ నివాసంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 తులాల వరకు బంగారం చోరీకీ గురైనట్లు బాధితులు తెలిపారు. సుక్కబాయి హైదరాబాద్‌ వెళ్లిన విషయాన్ని గమనించిన దొంగలు ఈ చోరీకి పాల్ప డినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పాముకాటుతో రైతు మృతి
1
1/1

పాముకాటుతో రైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement