అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య

Jun 5 2025 8:18 AM | Updated on Jun 5 2025 8:18 AM

అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య

అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య

బయ్యారం: అప్పులభారాన్ని తట్టుకోలేక ఓ యువకుడు పురుగులమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మానుకోట జిల్లా బయ్యారం మండలంలోని వెంకట్రాంపురంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుబ్బాకుల రఘు(35) ఏడు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు కుటుంబంతో వెళ్లి టైల్స్‌ పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల తల్లి సంవత్సరీకం నేపథ్యంలో వచ్చిన రఘు.. అప్పులు పెరిగాయనే మనస్థాపంతో ఈ నెల 2న పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. రఘుకు భార్య ప్రవళిక, ఇద్దరు పిల్లలున్నారు. ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement