
బావిలో పడి వ్యక్తి మృతి
ఎల్కతుర్తి: మేక పిల్లలకు గడ్డికోసమని వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని జగన్నాథ్పూర్లో బుధవారం చో టు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇల్లందుల సుధాకర్(35) మంగళవారం మేకపిల్లలకు గడ్డికోసుకొచ్చేందుకు వెళ్లా డు. బావిపక్కన గడ్డి కోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. సుధాకర్ రాత్రి 8 గంట లు దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తుడు పొలం ఒడ్డుపైన ఉన్న చెప్పులు చూసి బావిలో పరిశీ లించగా.. నీటిలో సుధాకర్ మృతదేహం కన్పించింది. కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారమందించారు. వారు మృతదేహాన్ని వెలికితీయించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.