ఉచిత శిక్షణను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉచిత శిక్షణను వినియోగించుకోవాలి

Jun 5 2025 8:18 AM | Updated on Jun 5 2025 8:18 AM

ఉచిత శిక్షణను  వినియోగించుకోవాలి

ఉచిత శిక్షణను వినియోగించుకోవాలి

ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను స్క్రీనింగ్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేసి గ్రూప్స్‌, పోలీస్‌, బ్యాంకింగ్‌, రైల్వే ఇతర ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎలాంటి శిక్షణ పొందని అభ్యర్థులు స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్స్‌ ద్వారా ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేయాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 75699 51515, 83285 46015 సంప్రదించాలని తెలిపారు.

25వరకు దూరవిద్య

పరీక్ష ఫీజు చెల్లించాలి

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యలో పీజీ ఎంఏ, ఎంకామ్‌ కోర్సులకు ఎక్స్‌ అభ్యర్థులు, ఇంప్రూవ్‌మెంటు పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఈనెల 25వ తేదీవరకు ఫీజు చెల్లించాలని కేయూ దూ రవిద్య కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.సురేష్‌లా ల్‌ సూచించారు. అన్ని పేపర్లకు రూ.700, రెండు పేపర్ల వరకు రూ.600, ఇంప్రూవ్‌మెంటు ఒక్కో పేపర్‌కు రూ.300ల చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆయా పీ జీ కోర్సుల ఎక్స్‌ అభ్యర్థులకు ఈ ఏడాది జూలై–ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారని,టైంటేబుల్‌ ను తర్వాత విడుదల చేస్తారని పేర్కొన్నారు.

ట్రాక్‌పై రాళ్లు..

ఇరువురిపై కేసు

నిలిచిపోయిన వందేభారత్‌,

గరీబ్‌రథ్‌ రైళ్లు

కాజీపేట రూరల్‌ : కాజీపేట–పెండ్యాల రైల్వే స్టేషన్‌ మధ్య ఆదివారం రైల్వే ట్రాక్‌పై బండరాళ్లు పెట్టిన కేసులో ఇరువురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు బుధవారం కాజీపేట ఆర్పీఎఫ్‌ సీఐ ఛటర్జీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు రైల్వే కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నారు. ఈక్రమంలో ఏమైతదో చూస్తమని రైల్వే ట్రాక్‌పై బండ రాళ్లు పెట్టారు. దీంతో ఆఫ్‌లైన్‌లో వందేభారత్‌, డౌన్‌లైన్‌లో గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు 20 నిమిషాలపాటు నిలిచిపోయినట్లు ఛటర్జీ వివరించారు. బండరాళ్లు పెట్టిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపినట్లు సీఐ తెలిపారు.

మద్యం బాటిళ్లు, పటిక, బెల్లం ధ్వంసం

అక్రమంగా తరలిస్తూ పట్టిబడిన మద్యం బాటిళ్లతోపాటు పటిక, బెల్లంను ధ్వంసం చేసినట్లు కాజీపేట జీఆర్పీ సీఐ వి.నరేష్‌కుమార్‌ బుధవా రం తెలిపారు. క్వార్టర్‌ బాటిళ్లు–96, 90ఎంఎల్‌ బాటిళ్లు–384, 30 కిలోల బెల్లం, 8 కిలోల పటికను ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమోహన్‌, జీఆర్పీ సీఐ నరేష్‌కుమార్‌, ఎస్‌హెచ్‌ఓ ఉపేందర్‌ సమక్షంలో ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

యువకుడిపై యువతి కుటుంబసభ్యుల దాడి

హన్మకొండ కల్చరల్‌ : తన కూతురుకు ఫోన్‌ చేసి వేధిస్తున్నాడని యువకుడిపై దాడికి పాల్ప డిన ఘటన వరంగల్‌ భద్రకాళి దేవాలయంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం భద్రకాళి దేవాలయం ఆవరణలో యువతి తల్లి యువకుడిపై తీవ్రంగా కొట్టింది. యువకుడు ఫోన్‌ చేసి వేధించడంలో వాస్తవం లేదని స్నేహితులు చెప్తున్నా వినకుండా దాడికి పాల్పడింది. భద్రకాళి దేవాలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న మట్టెవాడ సీఐ గోపి స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement