
పశువుల ఎరువుతో భూసారం
పెద్దవంగర: వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోతుండడంతో నేలలోని పోషక నిల్వల్లో సమతుల్యత లోపించి ఉత్పాదకత తగ్గుతోంది. చీడపీడలు ఆశించడం.. సూక్ష్మ పోషకాల లోపం దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈ సమస్యలు అధికమించాలంటే సేంద్రియ పద్ధతులు పాటించాలని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
వేసవి దుక్కులు దున్నే ముందు..
ఆవులు, గేదెలు, గొర్రెల ఎరువు పంటల సాగులో ఎంతో ఉపయోగపడుతుంది. సేంద్రియ ఎరువుతో సమానం. దీనిని దుక్కులు దున్నడానికి ముందే పంట భూముల్లో వేసి దున్నితే అద్భుత ఫలితం ఉంటుంది. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించడానికి వీలుంటుంది. దుక్కులు దున్నిన తర్వాత పశువుల పేడ మొత్తం భూమిలోకి వెళ్లి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతోంది. పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు పశువులఎరువు ఉపయోగపడుతుంది. గ్రామాల్లో ట్రాక్టర్, ఎడ్లబండ్ల సాయంతో ఎరువులను పొలాల్లోకి చేరుస్తున్నారు.
భూసారం పదిలం..
సాధారణంగా రైతులు వేసవిలో పశువుల ఎరువు ను వ్యవసాయ పొలాలకు తరలిస్తుంటారు. అదే స మయంలో ఎండలు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా పశువుల ఎరువును పొ లంలో చల్లితే వాటిలో ఉన్న పో షకాలు ఆవిరవుతాయి. అందు కే పశువుల పేడను పొలంలో కు ప్పలు పోసుకోవాలి. భూమిలో తగు తేమ ఉన్న సమయంలోనే వెదజల్లి వెంటనే దుక్కిలో కలియదున్నాలి. దీంతో భూసారం పెరుగుతుంది. నేలలోని ఆమ్లత్వం, క్షారత్వం, నీటిని నిల్వా ఉంచే గుణాన్ని అదుపుచేసి పోషకాలు మొక్కలకు అందేలా తోడ్పాటునిస్తుంది.
19,600 ఎకరాల్లో సాగు భూమి..
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో సుమారు ఈ ఏడాది 19,600 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు ఆవులు, గేదెలు, గొర్రెలు వంటి పశువుల ఎరువునే తమ పొలాలకు వాడుతున్నారు.
వేసవి దుక్కులతో మేలు
అధిక దిగుబడులు సాధించొచ్చు
భూసారం పెరుగుతుంది
పశువుల ఎరువుతో భూసారం పెరుగుతుంది. సహజ సిద్ధ పో షకాలు అందుతాయి. నేలలో ని నీటిని నిల్వ ఉంచే గుణం అదుపు చేసి పోషకాలను మొక్కలకు అందే విధంగా సాయపడుతుంది. రైతులు పశువుల ఎరువుతో అధిక దిగుబడులు పొందొచ్చు. వీటితో పండించి పంటను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.
గుగులోత్ స్వామి నాయక్, ఏఓ,
పెద్దవంగర

పశువుల ఎరువుతో భూసారం

పశువుల ఎరువుతో భూసారం

పశువుల ఎరువుతో భూసారం