
బీజేపీ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
కేయూ క్యాంపస్: బీజేపీ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని మే 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక సంఘాల జిల్లాస్థాయి సదస్సులో తీర్మానించారు. కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ విభాగం సెమినార్హాల్లో శనివారం నిర్వహించిన ఈ సదస్సులో వివిధ కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందన్నారు. కార్మికులు సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని కార్మికులు, ఉద్యోగులంతా విజయవంతం చేయాలన్నారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్పావని, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, ఐఎఫ్టీయూ రాష్ట్రకార్యదర్శి శ్రీనివాస్, ఏఐసీటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎమ్మెస్రావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, రాగుల రమేష్, రాంమూర్తి, కుసుమ శ్యాంసుందర్, మైముద, రాజేందర్, రవి, చక్రపాణి, అశోక్, సంపత్, రాజేశ్వరి, కల్పన పాల్గొన్నారు.
మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె
కార్మిక సంఘాల జిల్లాస్థాయి సదస్సులో తీర్మానం