
మహబూబాబాద్
శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
చలో ‘రజతోత్సవం’
ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో అంగరంగ వైభవంగా ఉద్యమ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించేందుకు వేదిక సిద్ధమైంది. సభకోసం సూర్యాపేట జిల్లానుంచి ఎడ్లబండ్లపై బయలుదేరిన గులాబీ శ్రేణులు శుక్రవారం సాయంత్రానికి వరంగల్ నగర శివారుకు చేరుకున్నాయి. శనివారం ఉదయం ఎల్కతుర్తికి బయలుదేరనున్నాయి.
I
శుక్రవారం ఉష్ణోగ్రతలు( డిగ్రీ సెల్సియస్)
42.6
ఖిలావరంగల్
హన్మకొండ: వేసవిలో ఉద్యాన పంటలను తగు జాగ్రత్తలు తీసుకోవ డం ద్వారా కాపాడుకోవచ్చు. కిచెన్, రూఫ్ గార్డెన్ నిర్వహిస్తున్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు పండాలంటే ఎంత స్థలంలో సాగు చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. సాగుకోసం నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి పెంచుకోవాలి. మొక్కలను ఎండ, వాన ఇతర ప్రతికూల పరిస్థితులనుంచి కాపాడుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పూత రాలిపోతుంది. మొక్కలకు ఎప్పుడు తేమ తగిలేలా చూసుకోవాలి. కర్రల సాయంతో గ్రీన్ షేడ్నెట్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. వేప నూనె, కషాయాలు మొక్కల పాదులో కాకుండా పైనా పిచికారీ చేయాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా
ఉంటుంది. – చేరాల రాకేశ్, వరంగల్ ఉద్యాన అధికారి (టెక్నికల్)
పనులు పూర్తి చేయాలి
కొత్తగూడ: ఆశ్రమ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేసవి సెలవుల్లో పూర్తి చేయాలని ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని స్పోర్ట్స్ పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా పీఓ మాట్లాడుతూ.. రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సిన పనులను చేయాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలని, కావాల్సిన పనులకు నివేదికలు పంపాలని ఏఈ రవికి సూచించారు. ఆమె వెంట ఏటీడీఓ భాస్కర్, అధికారులు ఉన్నారు.
కేసీఆర్ను ప్రజలు నమ్మరు..
మహబూబాబాద్ అర్బన్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండుసార్లు అఽధికారం ఇస్తే నిర్బంధాలు, దోపిడీ, కుటుంబ పాలన సాగించిన మాజీ సీఎం కేసీఆర్ను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని తెలంగాణ ఉద్యమాకారుల రాష్ట్ర వేదిక చైర్మన్ కూరపాటి వెంకట్నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఎంతో మంది అమరుల త్యాగంతో తెలంగాణ సాధిస్తే.. సెంటిమెంట్తో కేసీఆర్ పదవులు చేపట్టి దళితులు, బహుజనులను నిర్బంధించి తమ నిజ స్వరూపాన్ని చాటుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభను ఉద్యమాకారులు వ్యతిరేకిస్తున్నామన్నారు. కె.శంకర్, కృష్ణారావు, అనిల్, మల్లేశ్, భిక్షం ఉన్నారు.
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
వరంగల్ లీగల్: ఉమ్మడి జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి చండీశ్వరదేవిని యాదాద్రి భువనగిరికి బదిలీ చేయగా.. ఆస్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.పూజను నియమించారు. ఖాళీగా ఉన్న నర్సంపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రెండో జూనియర్ సివిల్ జడ్జి ఎస్.అంకిత్ను నియమించారు. హనుమకొండ జిల్లా పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లింగం శాలినిని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బదిలీ చేయగా.. ఆస్థానంలో ఎల్బీనగర్ రెండో జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్ను నియమించారు. మహబూబాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా హైదరాబాద్కు చెందిన జూనియర్ సివిల్ జడ్జి ఎం.స్వాతిని నియమించారు. మహబూబాబాద్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతిని రెండో జూనియర్ సివిల్ జడ్జిగా మల్కాజ్గిరికి, ఆయన స్థానంలో హుస్నాబాద్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్వపల్లి కృష్ణతేజ్ను నియమించారు. తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి మట్టా సరితను పెద్దపల్లి జిల్లా నందిమేడారం కోర్టుకు, ఆస్థానంలో షాద్నగర్ కోర్టుకు చెందిన జడ్జి ధీరజ్కుమార్ను నియమించారు. భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.రాంచందర్రావును సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్కు, ఆయన స్థానంలో మేడ్చల్ కోర్టుకు చెందిన జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్నాయక్ను బదిలీ చేశారు. ములుగు జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్నను నియమించగా.. ములుగు జూనియర్ సివిల్ జడ్జి జె.సౌఖ్యను హైదరాబాద్కు బదిలీ చేశారు.
సభకు భారీగా తరలిరావాలి
గార్ల: హనుకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పిలుపునిచ్చారు. శుక్రవారం గార్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. నాయకులు పి.రాధాకృష్ణ, లింగాల ఉమేశ్, మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేశ్, బి.మురళి, ధరావత్ సక్రు, ఎండి ఖదీర్, గాజుల గణేశ్, బి.లక్ష్మారెడ్డి, మీగడ శ్రీనివాస్, బాలునాయక్ పాల్గొన్నారు.
సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
మరిపెడ రూరల్: రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డీఆర్డీఓ మధుసూదన్రాజ్ అన్నారు. శుక్రవారం మరిపెడ మండలం వీరారం, పురుషోత్తమాయగూడెం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏపీఎం బానోతు రాములు, సీసీలు రుక్మిణి, చందూలాల్, సీఏ రాణి, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
42.4
సీరోలు (మానుకోట)
42.9
ములుగు రోడ్డు
42.8
జఫర్గడ్
43.2
కన్నాయిగూడెం
42.5
ములుగు
ఎంజీఎం : వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఎం. పవన్కుమార్ ప్రజలకు సూచించారు. ఎండాకాలం తీసుకోవా
ల్సిన పలు జాగ్రత్తల గురించి ఆయన పలు సూచనలు చేశారు.
● అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకపోవడం మంచిది.
● తేలిగ్గా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి
● మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బుజా తినాలి.
● అహారంలో మసాలా, ఉప్పు తగ్గించి వాడాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది.
● వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు. బీపీ, షుగర్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి.
● కొన్ని రకాల మాత్రలు (డియురేటిక్స్, ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటర్స్) వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది.
● తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఉన్నట్లయితే ఎండదెబ్బ తగిలినట్టుగా భావించి డాక్టర్ సలహా తీసుకోవాలి.
● డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, రెగ్యులర్గా షుగర్ పరీక్షలు చేయించుకోవాలి.
● డాక్టర్ సలహా లేకుండా మందులు మానేయరాదు.
● గర్భిణులు నీరు, ఆహారం, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.
– డాక్టర్ ఎం.పవన్కుమార్, ఎండీ, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, భూపాలపల్లి
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో 42నుంచి 43.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోల్బెల్ట్ ఏరియా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మే నెలలో 46డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం 10 గంటలు దాటితే అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మూగజీవాలు, పక్షులకు తాగునీటి వసతి కల్పించాలి. ఇప్పుడు ప్రతి నగరం, పట్టణ కేంద్రాల్లో రూఫ్గార్డెన్లతో ఇంటికి అవసరమైన కూరగాయలు పండిస్తున్నారు. వారు ఎండవేడికి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం ఉంటుంది. మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల వారు కారు మెయింటెన్ చేస్తుంటారు. మండే ఎండలకు వీటి నిర్వహణ బాగుంటేనే మన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈ నేపథ్యంలో వేసవిని ఎదుర్కొనేందుకు వైద్యులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, పశువైద్యాధికారులు చెబుతున్న సూచనలు, సలహాలు మీకోసం..
● ఇప్పటికే 43 డిగ్రీలు దాటిన వైనం
● వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
● పక్షులు, పశువులకు తాగునీరు
అందుబాటులో ఉంచుదాం..
● వాహనాల బ్యాటరీపై అధిక లోడ్
ఉండకుండా చూసుకోవాలి..
● ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలు
– ఎండీ జాఫర్, సీనియర్ మెకానిక్
ఖిలా వరంగల్: వేసవిలో ఏ వాహనమైన ఇంధనాన్ని పూర్తిగా నింపొద్దు. ఎండ వేడికి ఇంజన్ ఆయిల్ త్వరగా పలుచబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజనాయిల్ను మార్చుకోవడం మంచిది. వాహన పెట్రోలు ట్యాంకుపై మందం కవర్ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణమైనవి. అయితే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వేడి కాకుండా ఉండేందుకు వెలివేట్ క్లాత్ వంటి సీటు కవరును వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్ చేసి ఉంచితే ద్విచక్రవాహనాలు దెబ్బతింటాయి. ఇంజన్లో మంటలు వస్తాయి. టైర్లు పేలుతాయి. ఎప్పటికప్పుడు కూలెంట్ ఆయిల్ చెక్చేసుకోవాలి. దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో వాహనాలను ఆపి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వాహన ఇంజన్ వేడి తగ్గి కూల్ అవుతుంది. వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్లలో పార్కింగ్ చేయడం మంచిది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బైక్ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. ఎండ వేడికి టైర్లు మెత్తబడి గాలి తగ్గి, బైక్ మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కోసారి బైక్ టైర్లు పేలి అదుపు తప్పి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వేసవిలో వాహనాల్లో బ్యాటరీపై ఎక్కువ లోడ్ పడుతుంది. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, పరిమితికి మించి వాహనంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను బిగించడం వల్ల షార్ట్ సర్క్యూట్కు ఆస్కారం ఉంటుంది.
చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్
– డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్
ఎంజీఎం : హీట్ స్ట్రోక్ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి ఆవరణలో ఎండలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్ స్ట్రోక్కు గురవుతారు.
హీట్ స్ట్రోక్ లక్షణాలు..
● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది
● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్తారు.
● పసిపిల్లలు డల్గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి.
● అందుకే పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి.
● పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ తాగించాలి.
● వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపజేయాలి.
మూగజీవాలకు
తాగునీరు అందిద్దాం
– నాగ ప్రసాద్, పశువైద్యాధికారి, బచ్చన్నపేట
జనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్ల వెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి.
ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి
– కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్
నెహ్రూసెంటర్: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్, టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్, వంటి వాటిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడగాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్ వైరింగ్ చేయాలి. చార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలిగిన విద్యుత్ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండెలు కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే మెకానిక్, ఎలక్ట్రీషియన్కు చూపించాలి.
గూడూరులో నిర్వాహకులు కూర్చునేందుకు వేసిన పాక
ఎండకు ఎండుతూ..
గూడూరు: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మాయిశ్చర్ వచ్చేందుకు రైతులు రోజుకు రెండు, మూడుసార్లు ధాన్యాన్ని తిరగబోస్తున్నారు. ఈక్రమంలో కాసేపు సేదదీరడానికి టెంట్ ఏర్పాటు చేయలేదు. తాటిపత్రితో నిర్వాహకుల కోసం పాక వేశారు. అందులోకి వెళ్తే తాటిపత్రి నుంచి వేడి వచ్చి అక్కడ ఉండలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం ధాన్యం తిరగబెట్టేటప్పుడు నీడ కోసం చూస్తే ఎక్కడ కనిపించడం లేదని, అనారోగ్యానికి గురవుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
నీడ లేక ఇబ్బందులు పడుతున్నాం
పది రోజుల క్రితం వడ్లు అమ్మడానికి తీసుకొచ్చాను. తేమశాతం లేదనడంతో ఆరబెట్టాం. మాయిశ్చర్ రావడం కోసం రోజుకు నాలుగుసార్లు వడ్లను తిరగబెడుతున్నా. మండుటెండలో కూడా ఆరబోసిన గింజలను నేర్పాల్సి వస్తుంది. కొద్దిసేపు నీడలో ఉందామని చూస్తే, నిర్వాహకులు వేసుకున్న పాకలో ఎండ వేడిమి తప్పడం లేదు. నీడ కోసం పాకలు వేస్తే బాగుంటుంది. వేడి గాలికి క్యాన్లోని మంచి నీళ్లు కూడా తాగలేని పరిస్థితి. నిర్వాహకులను అడిగితే.. తాముండడానికే నీడ, చల్లని నీళ్లు లేవని అంటున్నారు.
– ఓర్సు వెంక్నన్న, రైతు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి, జమాండ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉందని రైతులు పేర్కొన్నారు. టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ధాన్యం ఆరబెట్టిన అనంతరం సమీపంలోని చెట్లనీడలో కూర్చుంటున్నారు. అలాగే ఇళ్ల నుంచి మంచినీరు వెంట తెచ్చుకుని తాగుతున్నారు. అధికారులు స్పందించి వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
మంచినీళ్లు తెచ్చుకుంటున్నాం
మా గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజుల క్రితం 15 పుట్ల ధాన్యాన్ని ఆరబోసుకున్నాం. ఇక్కడ తాగునీరు ఏర్పాటు చేయలేదు. ఇంటి వద్ద నుంచి మంచినీరు తెచ్చుకుని తాగుతున్నాం. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ధాన్యం ఆరబోసి నీడపట్టున ఉండి కాపాలా కాయాల్సి వస్తుంది.
– కొమ్ము కట్టయ్య, రైతు, జమాండ్లపల్లి
టెంట్లు ఏర్పాటు చేయలేదు..
నేను పది రోజుల క్రితం ఆరుపుట్ల ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు కేంద్రంలో ఆరబోశాను. మాకు ఇక్కడ ఎలాంటి టెంటు సౌకర్యం ఏర్పాటు చేయలేదు. మధ్యాహ్నం సమీపంలోని చెట్ల నీడలో ఉంటున్నాం. మండే ఎండలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరాలను గుర్తించి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.
– అజ్మీరా విజేందర్, కౌలురైతు, సీత్లాతండా
●
సభకు ఇలా వెళ్లొద్దాం..
రూట్మ్యాప్ వివరాలు
– IIలోu
ఉద్యాన పంటలకు ఎప్పుడూ తేమ ఉండాలి
న్యూస్రీల్
వృద్ధులు, గర్భిణులు జాగ్రత్త..
వాహనాలు జరభద్రం..
చెట్టు నీడే దిక్కు..
పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు కరువు
అందుబాటులో లేని టెంట్లు, తాగునీరు చెట్ల కిందే సేదదీరుతున్న రైతులు

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్