
విత్తన చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
దంతాలపల్లి: నూతన విత్తన చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు నూతన విత్తన చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే నూతన విత్తన చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆ చట్టం ద్వారా ప్రభుత్వం రైతుల కోసం వివిధ రాయితీలు అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ నిపుణులు నరసింహారెడ్డి, ఏఓ వాహిని, వివిధ గ్రామాల రైతులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన..
నర్సింహులపేట: నూతన విత్తన చట్టం–2025పై మండలంలోని పెద్దనాగారం స్టేజీ వద్ద విత్తన కమిటీ సభ్యులు, రైతులతో గురువారం అధికారులు ముఖాముఖి నిర్వహించారు. స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి పాల్గొని రైతులతో మాట్లాడారు. రైతుల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. విత్తన చట్టాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా రూపొందింస్తున్నామన్నారు. వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్, వ్యవసాయ విధాన సలహాదారు దొంతి నర్సింహారెడ్డి, ఏఓ వినయ్కుమార్, ఏఈఓ శరత్చంద్ర, రైతులు సొమిరెడ్డి, అశోక్రెడ్డి, వెంకన్న, సుధాకర్, నర్సింహ, అనిల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.