
మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● వరంగల్ జోనల్ మలేరియా
అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య
తొర్రూరు : ఉమ్మడి వరంగల్ జిల్లాను మలేరియా రహితంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని ఉమ్మడి జోనల్ మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ ఇ.నాగయ్య పేర్కొన్నారు. జాతీయ కీటక జనిత నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ల్యాబ్, రికార్డులను పరిశీలించారు. ప్రై డే– డ్రై డే కార్యక్రమ తీరుతెన్నులపై ఆయన ఆరా తీశారు. పెద్దవంగర మండలం పోచారంలోని డెంగీవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఇంటిని సందర్శించి వారితో మాట్లాడారు. అనంతరం నాగయ్య మాట్లాడుతూ మలేరియా కేసులను సకాలంలో గుర్తించి ప్రాణాలు పోకుండా ఉండేలా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి జ్వలిత, వైద్యులు మీరాజ్, నందన, ఆరోగ్య సిబ్బంది కుసుమ విద్యాసాగర్, వనాకర్రెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.