
పారదర్శకంగా ఎంపిక చేయాలి
దంతాలపల్లి: జిల్లాలో ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అ న్నారు. మండలంలోని బీరిశెట్టిగూడెంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆయన పరిశీలించా రు. ఈ సందర్భంగా జాబితాలో ఉన్న ఇళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులకు న్యాయం చేయాలని సూచించారు. అనర్హులు ఉంటే తొలగించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వివేక్రామ్, వెరిఫికేషన్ అధికారి వాహిని, ఎంపీఓ అప్సర్పాషా తదితరులు పాల్గొన్నారు.
చిన్నగూడూరులో..
చిన్నగూడూరు: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపడుతున్న సర్వేను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో బుధవారం పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామారావు, ఎంపీఓ రజిని తదితరులు ఉన్నారు.