
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి అంటే కూల్చేవాడని, అది హైడ్రాతో అర్థమైందన్నారు. ప్రజలకు నమ్మకం, విశ్వాసం, ధైర్యాన్ని కల్పించేందుకే బీఆర్ఎస్ సభ జరుగుతుందన్నారు. మానుకోట నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలన్నారు. సభకు 10లక్షల మందికి పైగా జనాలు రానున్నారని, అందుకోసం 15లక్షల వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారన్నారు. కొంత మంది ప్రైవేట్ పాఠశాలల యజమానులు బస్సులు కిరాయికి ఇచ్చేందుకు సహకరించడం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మాట్లాడుతూ.. ఈనెల 27న పార్టీ జెండా ఆవిష్కరణ చేసి సభకు తరలిరావాలన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తమ బతుకులు మారుతా యని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అనంతరం నాయకులకు పార్టీ కండువాలు, సామగ్రిని పంపిణీ చేశారు. సమావేశంలో నాయకులు రవి, మురళి, రంజిత్రెడ్డి, జనార్దన్, రాజు, అశోక్, ఫరీద్, ప్రభాకర్, రావిశ్, సలీం, జానీ తదితరులు పాల్గొన్నారు.
సభతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు
బీఆర్ఎస్ రజతోత్సవ సభతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీలోని వెంకటేశ్వర బజార్లో శుక్రవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ ఽశంకర్నాయక్ ఇంటింటా ప్రచారం చేశారు. మాజీ మంత్రి మహిళలకు కుంకుమ బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. నాయకులు లూనావత్ అశోక్, నాయిని రంజిత్రెడ్డి, గద్దె రవి, గోగుల రాజు, చిట్యాల జనార్దన్, సలీం పాల్గొన్నారు.