
నూతన ఆవిష్కరణలు చేపట్టాలి
● ఎస్సార్ వీసీ డాక్టర్ దీపక్గార్గ్
హసన్పర్తి: సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేపట్టాల ని ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ దీపక్గార్గ్ అన్నారు. నగ ర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో యంత్ర–25 ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి డాక్టర్ దీపక్గార్గ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ‘వివిధా హబ్’ ప్రాజెక్ట్ భవిష్యత్లో కంటెంట్ గ్లోబలైజేషన్ను నిర్ధేశం చేస్తోందన్నారు. ప్రపంచ అవసరాలకనుగుణంగా విద్యార్థులు ఆవిష్కరణలు ఉండేలా ప్రోత్సహించాలన్నారు. జ్యూరీ అధ్యక్షుడు నాగేంద్రకుమార్ మా ట్లాడుతూ ‘వివిధా హబ్’ను మెరుగు పరిచి పాఠశాలలు, యూ నివర్సిటీలు, సామాజిక సేవా సంస్థలతో కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.