
‘సుమతిరెడ్డి’లో సందడి
హసన్పర్తి: నగర శివారులోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులు సందడి చేశారు. కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన శ్రీథమ్–25 కార్యక్రమం శనివారం ముగిసింది. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా హైదరాబాద్కు చెందిన ఎలిజియం బ్యాండ్ ప్రదర్శన హోరెత్తాయి. తొలుత నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్, ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ.. క్రమశిక్షణ పట్టుదలతో చదివితే ఉన్నతశిఖరాలు అధిరోహిస్తారని చెప్పారు. విద్యార్థినుల్లో దాగి ఉన్న సృజనా త్మక శక్తులను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాన్నారు. అనంతరం సావనీర్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎస్సార్ విద్యాసంస్థల సెక్రటరీ మధుకర్రెడ్డి, డైరెక్టర్ సాధనారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి, ఏఓ వేణుగోపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
హోరెత్తిన ఎలిజియం బ్యాండ్
బృంద ప్రదర్శన
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

‘సుమతిరెడ్డి’లో సందడి