టీ20ల్లో రెండో అత్యధిక స్కోర్‌ నమోదు

అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళా జట్టు రికార్డు స్కోర్‌ నమోదు చేసింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 4 వికెట్లు కోల్పోయి198 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఇది  రెండో అత్యధిక స్కోర్‌గా రికార్డుకెక్కింది. 2010లో నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా 205/1 పరుగులతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా(191/3), న్యూజిలాండ్‌ (188/3), ఇంగ్లండ్‌ (187/5)  తర్వాతి స్థానాల్లో ఉన్నాయి .

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top