వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్ బయల్దేరతారు. సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో భేటీ అవుతారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం గవర్నర్కు శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు. అలాగే సాయంత్రం అయిదున్నరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం అవుతారు.
గవర్నర్తో భేటీకానున్న వైఎస్ జగన్
May 25 2019 3:14 PM | Updated on Mar 21 2024 11:09 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement