ఐదు నెలల్లో 80 శాతం మేనిఫెస్టో అమలు | Vijaya sai Reddy Distributes Bank Loans To DWACRA Women | Sakshi
Sakshi News home page

ఐదు నెలల్లో 80 శాతం మేనిఫెస్టో అమలు

Oct 30 2019 8:12 AM | Updated on Mar 21 2024 11:38 AM

గత ప్రభుత్వంలో చంద్రబాబు పుత్రరత్న పాలన అందిస్తే.. మన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పాలన అందిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చమత్కరించారు. చిట్టివలస బంతాట మైదానంలో మంగళవారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి కింద రూ.73.46 కోట్ల రుణాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పదేళ్ల పోరాటం తరువాత వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టిందన్న విషయం గుర్తు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement