జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ ఉగ్రవాదిగా ప్రకటన | Sakshi
Sakshi News home page

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ ఉగ్రవాదిగా ప్రకటన

Published Thu, May 2 2019 4:54 PM

 దశాబ్ధ కాలంగా భారత్‌ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం మసూద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్‌ పదే పదే ఐక్యరాజ్యసమితిని కోరింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement